వరంగల్ న్యూస్టుడే:
*కేసీఆర్నే నమ్ముకున్నాను…..
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై తన కుటుంబమంతా బాధలో ఉందని ఆ పార్టీ నేత సీతారాంనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… తానేం తప్పు చేశానో అధిష్టానానికే తెలియాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో టికెట్ తనకేనని కేసీఆర్ చెప్పారని అన్నారు. తాను ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ లేదనడం, సర్వేలు అనుకూలంగా లేవనడం సరికాదన్నారు. సర్వేల లెక్కే లేదని.. అంతా కారు..సారు..కేసీఆరేనని సీతారాంనాయక్ అన్నారు. కేసీఆర్నే నమ్ముకున్నానని.. ఆయనే తనకు ఏదైనా చేయాలన్నారు. తాను పార్టీ మారేది లేదని, తనకు రాజకీయాలు ముఖ్యంకాదని సీతారాంనాయక్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment