Friday, March 22, 2019

ప్రెస్‌మీట్‌ వాయిదాపై భాజపా చురకలు……


ఢీల్లీ న్యూస్‌టుడే:
  • రాహుల్‌ ఇంకా నిద్ర లేచినట్లు లేరు…
  • శుక్రవారం ఉదయం కూడా రాహుల్‌ ప్రెస్‌ మీట్‌ ఉండగా కొన్ని కారణాల వల్ల దాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు….
  • రాహుల్‌ ఇంకా నిద్ర లేచినట్లు లేరు…
  • గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ..
మీడియా సమావేశం పెట్టి మరీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా రాహుల్‌ ప్రెస్‌ మీట్‌ ఉండగా కొన్ని కారణాల వల్ల దాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీనిపై వెంటనే స్పందించిన భాజపా.. కాంగ్రెస్‌కు కౌంటర్‌ ఇచ్చింది. రాహుల్‌ ఇంకా నిద్రలేవలేదేమో అంటూ చురకలంటించింది.శుక్రవారం ఉదయం 10.15 గంటలకు రాహుల్‌ గాంధీ ప్రత్యేక మీడియా సమావేశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నిన్న వెల్లడించింది. అయితే ఈ ప్రెస్‌మీట్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా పడిందని ఏఎన్ఐ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై భాజపా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో స్పందించింది. ‘రాహుల్‌ గాంధీ ఇంకా నిద్ర లేచినట్లు లేరు. పోనీలే పొద్దుపొద్దునే అబద్ధాలు వ్యాప్తి చేయడం మంచిది కాదు’ అని భాజపా ఎద్దేవా చేసింది.  

No comments:

Post a Comment