Saturday, March 23, 2019

సరదాగావచ్చి స్వర్గానికే వెళ్లేవా …..


శ్రీకాకుళం అరసవల్లి, న్యూస్‌టుడే: 
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో పీయూసీ-2 చదువుతున్న ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామానికి చెందిన జరుగుళ్ల వినయ్‌కుమార్‌(17) ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందాడు.ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లి వద్ద ఉన్న ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో చదువుతున్న వినయ్‌కుమార్‌ నాలుగురోజుల క్రితం జరజాంలో ఉన్న ఇంటికి వచ్చాడు.బుధవారం సొంతపనిపై శ్రీకాకుళం వెళ్లి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రైతుబజారు సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో వినయ్‌కుమార్‌ తలవెనుక భాగంలో గాయమయింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అదేరోజు మధ్యాహ్నం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. వినయ్‌కుమార్‌ తండ్రి రామారావు తాపీ మేస్త్రి కాగా తల్లి గృహిణి. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
                                                                                                        

No comments:

Post a Comment