ప్రకాశం దొనకొండ న్యూస్టుడే: ముఖ్యాంశాలు….
- టీన్యూస్10 ఆన్లైన్ ఎడిషన్…
- పెట్టుబడి అంతా నష్టపోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరు…
- బోర్ల కింద 80 ఎకరాల్లో వరి సాగు చేశారు…
- ఎకరాకు రూ.60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టారు…..
అకాల వర్షం అన్నదాతల కష్టాన్ని నేలపాలు చేసింది. ముంచుకొచ్చిన వరుణుడు అన్నదాతలను ఆందోళనకు గురిచేశాడు. మండలంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గాలులు మొదలై వడగండ్ల వాన కురిసింది. దొనకొండ మండలంలో 80 ఎకరాల్లో బొప్పాయి తోటలను సాగు చేశారు. ఎకరాకు రూ.60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మరో పది రోజుల్లో కాయలు కోతకు రానున్నాయి.ఇంతలో వర్షం రాగా కాయ మొత్తం రాలిపొయింది కొందరు రైతులకు చెందిన మిర్చి తడిసి పోయింది. పాకాలలో పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం మండెలపై ఉంది. వర్షంతో పొగాకు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల కందులు కల్లాల్లో ఉండగా.. అవికాస్తా తడిసి పోయాయి.