Friday, March 22, 2019

చోరీల బాగోతం…


కర్నూలు న్యూస్‌టుడే:
*ఇద్దరు దొంగల అరెస్టు…
*బోయ మద్దిలేటి, వంశీని అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వేలిముద్రలు సేకరించగా చోరీల బాగోతం బయటపడింది…
దొంగతనాలకు పాల్పడుతున్న బోయ మద్దిలేటి, వంశీని కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన మద్దిలేటి, కల్లూరుకు చెందిన వంశీ గుజరీ దుకాణంలో పనిచేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా చోరీలకు పాల్పడుతుండేవారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు వేలిముద్రలు సేకరించగా చోరీల బాగోతం బయటపడింది. ఇటీవల భాగ్యనగర్‌లోని ఆర్‌ఎం డిజిటల్‌ ఫ్లెక్సీ తయారీ కేంద్రంలోనూ, గతేడాది నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో వీరే దొంగతనం చేసినట్లు తేలింది. వీరి నుంచి రూ.1.15 లక్షలు, 6 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై శేషయ్య, ఏఎస్సై మస్తాన్, హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌కుమార్, కానిస్టేబుళ్లు లక్ష్మీనాయక్, రామచంద్ర, రామకృష్ణ, షాకీర్, రాజశేఖర్‌ నిందితులను పట్టుకున్నారు.

No comments:

Post a Comment