Friday, March 22, 2019

ఎయిర్‌పోర్ట్ లో పట్టుబడిన బంగారం……..


హైదరాబాద్ న్యూస్‌టుడే:
*ప్రయాణికుడి  వద్ద 220 గ్రాముల బంగారం పట్టుబడింది……
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఎయిర్‌పోర్ట్ లో తనిఖీ చేస్తుండగా.. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 600 గ్రాముల బంగారం, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి  వద్ద 220 గ్రాముల బంగారం పట్టుబడింది. దీంతో ఆ ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి.. వారి వద్దనున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

No comments:

Post a Comment