Friday, March 22, 2019

పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..


ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ నాయకులు ఆంధ్రావాళ్లను అడ్డగోలుగా తిడుతున్నా హైదరాబాద్‌లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడడానికి ధైర్యం లేకుండా పోయిందన్నారు.
ఓసారి తాను తెలంగాణలో సభ పెడితే తనను కొట్టేందుకు ఏకంగా వందమంది వచ్చారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందమంది తన సభలో దూరిపోయి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తనను కొడితే కూర్చోబెట్టి చేతులు ముడుచుకుని ‘అయ్యా, బాబూ’ అనే రకం తాను కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. వారు కొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, తాము అల్లూరి స్ఫూర్తితో పెరిగిన వాళ్లమని పవన్ గుర్తు చేశారు.

No comments:

Post a Comment