Friday, March 22, 2019

అభివృద్ధిని చూసి ఓటేయండి…….


ఒడిశా  న్యూస్‌టుడే:
శుక్రవారం రాత్రి పర్లాఖెముండి రాజప్రసాదం ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మన రాష్ట్రానికి నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వం కొనసాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు అన్ని వర్గాల వారి సంక్షేమానికి నవీన్‌పట్నాయక్‌ చేపడుతున్న పథకాలు అనన్యసామాన్యం అని వివరించారు. జాతీయస్థాయిలో పలు సంస్థలు, పలువురు నాయకులు నవీన్‌పట్నాయక్‌ను ఉత్తమ ముఖ్యమంత్రిగా పేర్కొంటున్నారన్నారు. కాశీనగర్‌ ఎన్‌.ఎ.సి. మాజీ అధ్యక్షురాలు మేడిబోయిన సుధారాణి మాట్లాడుతూ కళ్యాణి గజపతి తెలియదు అనేవారికి నేను ఒడిశావాసిని అనేహక్కు లేదన్నారు. ఒడిశా రాష్ట్ర అవతరణకు, పర్లాఖెముండి ప్రాంత అభివృద్ధికి గజపతుల వంశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వాటి ఫలాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. బిజద జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌నాయక్, బసంతకుమార్‌ దాస్, కళ్యాణిగజపతి, లక్ష్మికాంత పొరిచ్చా తదితరులు ప్రసంగించారు.

No comments:

Post a Comment