Friday, March 22, 2019

కాంగ్రెస్‌ పై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ …


ఢిల్లీ: కాంగ్రస్‌ స్థిమితం కోల్పోయి మాట్లాడుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారంలో ఉన్నప్పుడు భాజపా కేంద్ర కమిటీ, ఇతర అగ్ర నాయకులకు పెద్ద మొత్తంలో దోచిపెట్టారంటూ వెల్లడైన మీడియా కథనంపై  కాంగ్రెస్‌ చేస్తోన్న విమర్శలను భాజపా తిప్పికొట్టింది.  దానిపై యడ్యూరప్ప మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌, ఆ పార్టీ నాయకులు పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. మోదీజీకి పెరుగుతున్న పాపులారిటీని చూసి వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవి నకిలీ పత్రాలని ఐటీ విభాగం ఇప్పటికే నిరూపించింది’ అని కాంగ్రెస్‌ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ విడుదల చేసిన డైరీ నకిలీదని కర్ణాటక భాజపా ట్వీట్ చేసింది. ‘కాంగ్రెస్‌ సొంతంగా సిద్ధం చేసిన నకిలీ డైరీ పట్టుకొని రణ్‌దీప్ సూర్జేవాలా అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు. మీడియా సమయాన్ని వృథా చేస్తున్నారు’ అని ట్విటర్‌ వేదికగా విరుచుకుపడింది.

No comments:

Post a Comment