Wednesday, April 3, 2019

ఉత్తమ జర్నలిస్టుగా రత్నాకర్.....

తెనాలి:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…….
  • పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేయుట  ….
  • జాతీయ సమాచార సంఘ వార్షికోత్సవంలో భాగం
    గా తెనాలి పటణంలో ప్రముఖలకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 
  • అందులో భాగంగా జర్నలిస్టుగా, రత్నాకర్ ఉత్తమ లోకల్ మీడియా వేజెండ్ల ఉదయభాస్కర్, ఉత్తమ యాపారవేత్తగా వాసిరెడ్డి, బద్రి ప్రసాద్, సేవారంగంలో కిషోర్, ఆమీరినేని పురస్కారాలు అందుకున్నారు.                                                                                                                  

                                                                                                                 డెస్క్:దుర్గ  

ఏరులై పారుతున్న మద్యం ..

కృష్టా న్యూస్‌టుడే:
  • జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఓటర్లను ప్రభావితంచేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు మద్యం సరఫరా చేస్తూ పోలీసులకు ప
    ట్టుబుడుతున్నారు.
  • ఎన్నికల తేది దగ్గర పడే సమయంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని..
  • అధికారులు స్పందించి, కట్టు దట్టమైన భద్రత చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
                                                                                                            డెస్క్: లక్ష్మీ

పిల్లలను కూడా వదలని వైసీపీ కార్యకర్తలు……

అమరావతి న్యూస్‌టుడే:
అమరావతిలో ఈరోజు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు   టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ నేతల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వీళ్ల దుర్మార్గాలతో తరతరాల అభివృద్ధి అగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పుంగనూరులో   వైసీపీ నేతల్ బేదిరింపులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు, మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృ
ష్టించారని దుయ్యబట్టారు. పోలీసులు, జవాన్లపై చెప్పులు రాళ్లతో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు పొన్నూరులో స్కూలు పిల్లలు ఆటోలపై కూడా వైసీపీ దాడి చేశారని చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించారు.
                                                                                                                                                                                                                                                                                                                                                                       డెస్క్:కోటి  

Monday, March 25, 2019

మంచిమాట.

ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.

Saturday, March 23, 2019

రైతుకు భరోసా ఇచ్చిన నేత ….

శ్రీకాకుళం  న్యూస్‌టుడే:
*రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో…
*తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం…
రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ  అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు.ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు.  తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు.  ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్‌ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీతో ప్రతి రైతు  ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది.

న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసిన బాబు…..


విజయవాడ న్యూస్‌టుడే:
* టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు.
 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం విజయవాడలోని సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో వున్న నాల్గవ అడిషినల్ సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు. కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున నామినేషన్ పత్రాలను నిన్న టీడీపీ నేతలు రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేశారు. అయితే అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ప్రమాణం చేయలేకపోయారు. దీంతో ఇవాళ ఉదయం చంద్రబాబు సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేశారు