Friday, March 22, 2019

గురుతిప్పేరుద్ర స్వామి జాతర…….


కర్ణాటక చెళ్లకెర, న్యూస్‌టుడే: 
స్థానిక నాయకనహట్టి గురుతిప్పేరుద్ర స్వామి జాతర భక్తజనంతో కోలాహలంగా కనిపించింది. ఇసుక వేస్తే కింద రాలనంత భక్తులతో శుక్రవారం అత్యంత వైభవంగా జాతర జరిగింది. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.  సాయంత్రం స్వామి రథాన్ని భక్తులు ఒళమఠం సమీపం వరకు లాగి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి రథాన్ని లాగడానికి ముందుగా దేవస్థానం సమితి వేలం పాట ఏర్పాటు చేసిన బావుటా రథంపై ఉంచిన జెండాను తుమకూరు జిల్లా సోమశేఖర రూ.59 లక్షలకు దక్కించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్యం, బస్సు సౌకర్యాలు కల్పించారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిత్రదుర్గం జిల్లా అధికారిణి వినోత్‌ ప్రియ, జిల్లా పోలీసు అధికారి అరుణ్‌, మొలకాల్మూరు, చెళ్లకెర శాసనసభ్యులు బి.శ్రీరాములు, టి.రఘుమూర్తి, ఎంపీ చంద్రప్ప తదితరులు జాతరలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment