Friday, March 22, 2019

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డాగ్‌స్క్వాడ్ బృందం..


గుంటూరుజిల్లా:గోరంట్ల: న్యూస్‌టుడే:
*నాటుబాంబులు వెలుగు చూడడం ఉత్కంఠకు దారితీసింది. 
గోరంట్ల మండలంలోని కరావులపల్లిలో వైకాపా సీనియర్ నాయకుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆర్ వెంకటరెడ్డి ఇంటి ఆవరణలోని ఎరువుదిబ్బలో బుధవారం ఉదయం నాలుగు నాటుబాంబులు వెలుగు చూడడం ఉత్కంఠకు దారితీసింది. వివరాలు…కరావులపల్లికి చెందిన వెంకటరెడ్ది ఇంటి ఆవరణలో బాంబులున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సీఐ ధరణికిషోర్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఇంటి వెనుక ఎరువుదిబ్బ వేసుకున్న చోట ప్లాస్టిక్ కవర్‌లో బాంబులు ఉంచిన బ్యాగ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం మండలం మొత్తం వ్యాపించడంతో అన్నిచోట్ల చర్చనీయంశంగా మారింది.

No comments:

Post a Comment