Friday, March 22, 2019

మేము పోటి చేయం బాబోయ్……


శ్రీకాకులం,న్యూస్‌టుడే :
హరియాణలో  కాంగ్రెస్  పార్టీకి  విచిత్ర  పరిస్ధితి  ఎదురవుతోంది.లోక్ సభ  ఎన్నికల నేపధ్యంలో అభ్యర్ధుల  ఎంపిక  విషయంలో  ఆ పార్టీ అధిష్ఠానం  మల్లగుల్లాలు  పడుతోంది.రాష్ట్రంలోని  చాలా  మంది కాంగ్రెస్  సీనియర్  నేతలు  ఈ ఎన్నికల్లో  పోటీ  చెయడానికి విముఖత  చూపుతున్నారు. ఇటీవల జింద్  అసెంబ్లీ  నియోజక  వర్గానికి  జరిగిన  ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పర్టీ  రాణించలేకపోయింది. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ  తమ అభ్యర్ధిగా  ఏఐసీసీ  ప్రతినిధి  రణ్ దీప్  సుర్జేవాలాను  నిలబెట్టినప్పటికీ  ఏ మాత్రం ప్రభావం  చూపలేకపోయింది.ఎన్నిక  ఫలితాల్లో  బిజేపి  అభ్యర్ధి  గెలవగా, జేజేపీ నేత  రెండో  స్ధానంలో  నిలిచారు.  సుర్జేవాలా  మూడో  స్ధానంతో సరిపెట్టుకున్నారు.
                                                                                          

No comments:

Post a Comment