శ్రీకాకులం,న్యూస్టుడే :
హరియాణలో కాంగ్రెస్ పార్టీకి విచిత్ర పరిస్ధితి ఎదురవుతోంది.లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చెయడానికి విముఖత చూపుతున్నారు. ఇటీవల జింద్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పర్టీ రాణించలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధిగా ఏఐసీసీ ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలాను నిలబెట్టినప్పటికీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.ఎన్నిక ఫలితాల్లో బిజేపి అభ్యర్ధి గెలవగా, జేజేపీ నేత రెండో స్ధానంలో నిలిచారు. సుర్జేవాలా మూడో స్ధానంతో సరిపెట్టుకున్నారు.
No comments:
Post a Comment