కర్ణాటక మల్లేశ్వరం న్యూస్టుడే :
అంతర్జాతీయ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు నగరంలోని వివిధ పాఠశాలల్లో, కాలనీల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు జాగృతి కార్యక్రమాలను నిర్వహించారు. నీటిని కాపాడుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై నినాదాలు రాసిన అట్టముక్కలను విద్యార్థులు ప్రదర్శించారు. నీటి కోసం ఎక్కువగా ఉన్న శివారు ప్రాంతాల్లో వీధి నాటకాల ద్వారా కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రీన్వుడ్ పాఠశాలల విద్యార్థులు నీటి సంరక్షణపై పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు. వాటి ప్రత్యేకతలను సహ విద్యార్థులు, ఉపాధ్యాయులకు వారు వివరించారు. పాఠశాలలో వాన నీటి సరరక్షణతో సేకరించిన నీటినే అన్ని అవసరాలకు వినియోగించుకుంటున్నామని విద్యాసంస్థ నిరు అగర్వాల్ తెలిపారు.
No comments:
Post a Comment