మునిగుడ,ఒడిశా న్యూస్టుడే:
ఇంట్లో కొన్నాళ్లుగా అశుభం జరుగుతుందన్న నెపంతో ఆరునెలల కన్న బిడ్డను తల్లిదండ్రులే హతమార్చిన ఘటన రాయగఢ జిల్లా మునిగుడ సమితి బడపంగిడి గ్రామంలో చోటుచేసుకుంది. 15 తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అంబొదల పోలీస్స్టేషన్ పరిధిలోని సమదల గ్రామ సమీపంలో ఆరునెలల ఆడ శిశువు మృతదేహాన్ని ఈ నెల 15న రత్నాకర్ బాగ్ అనే గ్రామ రక్షకుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్డీపీఓ చంద్రశేఖర్ హోతా ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బడపంగిడి గ్రామానికి చెందిన రీతా ఉదాలి, జగదీష్ ఉదాలిల కుమార్తెగా గుర్తించారు. 17న రీతా, జగదీష్లను పోలీసులు అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఉన్ని ఉదాలి పుట్టిన తర్వాత ఇంట్లో అన్నీ అశుభాలే జరగడంతో 12న గ్రామ శివారులో పీక నులిమి చంపినట్లు అంగీకరించారు. అంబొదల పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టుకు తరలించారు.
No comments:
Post a Comment