విశాఖ న్యూస్టుడే:
సబ్బవరం మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఉండగా లగిశెట్టిపాలెం లేఔట్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో ఏమైనా మందుపాత్రలు లాంటి పేలుడు పదార్థాలు ఉంటాయేమోనని ముందుజాగ్రత్తగా మెటల్ డిటెక్టర్తో సిబ్బంది తనఖీ చేశారు. ఓ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా మెటల్ డిటెక్టర్ నుంచి చాలాసేపు హెచ్చరిక శబ్ధాలు వచ్చాయి. ఏమై ఉంటుందోనని కంగారుపడిన భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని తవ్వించగా పాత ఇనుప డబ్బా ఒకటి బయటపడింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
No comments:
Post a Comment