హైదరాబాద్ న్యూస్టుడే:
*నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని రాపోలు ఆరోపించారు…….
తెలంగాణ కాంగ్రెస్కు మరో ఝలక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి పంపించారు. పార్టీకి ఎంత నిబద్దతతో పనిచేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరించిందని రాపోలు ఆరోపించారు. పార్టీ విధేయులను మరిచి ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించటంలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న తనను కావాలనే పక్కన పెట్టారన్నారు. అయినా పార్టీ కోసం సంస్థాగతగా కృషి చేసినట్లు రాపోలు పేర్కొన్నారు.
No comments:
Post a Comment