కర్ణాటక మండ్య న్యూస్టుడే :
జిల్లాలోని నాగమంగల తాలూకాలో శుక్రవారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతులంతా నాగమంగల తాలూకాలో పలు గ్రామాల వారని సమాచారం. నాగమంగల తాలూకాలోని సంకనహళ్లి వద్ద ఆటో రిక్షాలో ప్రయాణికులు వెళ్తుండగా టిప్పర్ ఢీకొన్నట్లు తెలిసింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల పేర్లు తెలియరాలేదు. నాగమంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
No comments:
Post a Comment