విజయనగరం న్యూస్టుడే: ఒక సాధారణ గిరిజన ఉద్యోగి కుటుంబానికి చెందిన ఆమెకు… మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం ఏర్పడింది. విద్యాభ్యాసం, ఉద్యోగం, వివాహం తర్వాత కూడా అది అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో అనూహ్యంగా దక్కిన రాజకీయ అవకాశం ఆమెను ఎమ్మెల్యే చేసింది. ఆ తర్వాత ప్రజా ప్రతినిధిగా, రాజకీయ నేత భార్యగా జీవితంలో సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకున్నారు. ఎవరూ వెళ్లేందుకు సాహసించని మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడప తొక్కుతూ, ప్రతి ఇంటి సమస్య తెలుసుకుని పరిష్కరిస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు విజయనగరం జిల్లా కురుపాం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి.
No comments:
Post a Comment