కర్ణాటక హుబ్బళ్లి, న్యూస్టుడే :
పురపాలక వ్యవహారాలశాఖ మంత్రి సి.ఎస్.శివళ్లి కన్నుమూయడంతో రాష్ట్రంలో ఓ కీలక నేతను కోల్పోయినట్లయింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్నేహితులతో సంభాషిస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా ఉందంటూ కుప్పకూలారు.వెంటనే ఆయన్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తుండగా మృతి చెందారు. ధార్వాడ జిల్లా కుందగోళ శాసనసభ్యుడుగా మూడుసార్లు గెలుపొందిన ఆయన 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కుందగోళ ప్రాంతానికి రాజ్కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడుగా కూడా పనిచేశారు. 2013, 2018 నాటి ఎన్నికల్లో కుందగోళ నుంచి ఆయన విజయం సాధించారు. కుమారస్వామి మంత్రి వర్గంలో పురపాలక వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతల్ని నిర్వహించారు.ఆయన సొంత గ్రామం యరగుప్పిలో శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. శివళ్లి మృతికి ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment