Friday, March 22, 2019

తెదేపా, వైకాపాల మధ్య ఉద్రిక్తత….


పశ్చిమగోదావరి న్యూస్‌టుడే:
*ఉండిలో నామినేషన్ల దాఖలు సమయంలో….
*ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు..
*వారి అనుచరులు ఒకే సమాయానికి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు…
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నామినేషన్ల దాఖలు సమయంలో తెదేపా, వైకాపాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు.. వారి అనుచరులు ఒకే సమాయానికి ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో సమీపంలోని జాతీయ రహదారిపై ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. రెండు పార్టీల అభ్యర్థుల తరఫున భారీగా అనుచరగణం తరలిరావడంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది.
                                                                                                        

No comments:

Post a Comment