తమిళనాడు ప్యారిస్ న్యూస్టుడే:
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. కోటి నగదును తీసుకుని మబ్యపెట్టి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు…తిరునెల్వేలి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎరగా చూపుతూ మేలప్పాళెయంలో ఉన్న ప్రైవేటు ఏజెన్సీ సంస్థ నగదు వసూలు చేసింది. విదేశాల్లో లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. కోటి నగదు వరకూ వసూలు చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో 36 మంది బాధితులు తిరునెల్వేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి జాకీర్హుస్సేన్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.
No comments:
Post a Comment