శ్రీకాకుళం న్యూస్టుడే :
ఎల్ఎన్పేట మండలంలో శుక్రవారం వేకువ జామున ఏనుగులు హల్చల్ చేశాయి. ఏనుగులు కరకవలస కొండ నుంచి కుసుమలపాడు, చింతలబడవంజ, తురకపేట కూడలి వరకు వచ్చాయి. అటవీశాఖ అధికారులు, స్థానిక యువత మంటలు, బాణసంచాలు పేల్చటంతో వెనుదిరిగాయి. చింతాడ వెంకటరమణ, పేడాడ సన్యాసిరావు, కూన సత్యం తదితర రైతులకు సంబంధించిన ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. వీఆర్వో రామప్పడు ఆ గ్రామాల్లో పర్యటించి ఏనుగులు కలిగించిన నష్టాన్ని అంచనా వేశారు. తహసీల్దారుకు నివేదిక అందజేస్తున్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment