Friday, March 22, 2019

మరో 16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన… జనసేన.


జనసేన నుంచి మరో జాబితా వచ్చేసింది. మరో 16 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరులలో రెండు అసెంబ్లీ స్థానాలు, అనంతపురంలో ఐదు, కడప జిల్లాలో ఓ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డికి నంద్యాల టికెట్ కేటాయించింది. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆకుల ఉమేశ్, పులివెందులలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తుపాకుల చంద్రశేఖర్‌ను బరిలోకి దింపింది. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి సాకె పవన్‌కుమార్‌ను పవన్ బరిలో నిలిపారు.

No comments:

Post a Comment