Friday, March 22, 2019

ఓటు వినియోగించిన బాబు….


అమరావతి న్యూస్‌టుడే:
*ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి……
సీఎం చంద్రబాబు ఓటు వేశారు. తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికకు చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో ఒక టీచర్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది.

No comments:

Post a Comment