తమిళనాడు ప్యారిస్ న్యూస్టుడే:
*వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కుమార్తెను హతమార్చిన తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.వారి కథనం మేరకు…
నీలగిరి జిల్లా ఊటివద్ద కొడప్పమందు అంబేడ్కర్ కాలనీకి చెందిన జగన్నాథన్ (40), ఇతని భార్య రాజ్యలక్ష్మి (35), వీరి కుమార్తె ఉషారాణి (11) ఊటిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతుంది. రెండేళ్ల కిందట జగన్నాథన్, రాజ్యలక్ష్మి అభిప్రాయ బేధాలతో విడిపోయారు. దీంతో ఉషారాణి తల్లితో ఉంటుంది. అదేవిధంగా రాజ్యలక్ష్మికి పక్కింటి యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం తన కుమార్తె ఊయల ఊగుతూ తాడు చుట్టుకుని సృహ కోల్పోయిందని ఏడుస్తూ ఊటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఉషారాణిని పరిశీలించిన డాక్టర్లు ఆమె మృతి చెందినట్లు తెలిపి పోస్టుమార్టం నిర్వహించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మి వద్ద విచారించగా పొంతనలు లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అప్పుడు రాజ్యలక్ష్మి తన వివాహేతర సంబంధానికి ఉషారాణి అడ్డుగా ఉందని గొంతునులిమి చంపినట్లు తెలిపింది. అనంతరం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
No comments:
Post a Comment