Friday, March 22, 2019

గల్లా పై మోదుగుల ఫైర్….

గుంటూరు న్యూస్‌టుడే:
*గుంటూరులో గల్లా జయదేవ్‌ను వదిలిపెడితే తప్పిపోతారని ఎద్దేవా చేశారు……
గల్లా జయదేవ్ విజిటింగ్ ప్రొఫెసర్ అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు. మళ్లీ గుంటూరు ప్రజలను మోసం చేసేందుకు గల్లా కుటుంబం వాలిపోయిందని విమర్శించారు. జయదేవ్ గుంటూరు ఎంపీగా గెలిచి పరిశ్రమలన్నీ చిత్తూరులో పెట్టించారని చెప్పారు. గుంటూరు పార్లమెంట్‌లో ఎన్ని మండలాలు ఉన్నాయో గల్లాకు తెలుసా? అని అడిగారు. గుంటూరులో గల్లా జయదేవ్‌ను వదిలిపెడితే తప్పిపోతారని ఎద్దేవా చేశారు. ఇక పొన్నూరులో ధూళిపాళ్లకు పుల్‌స్టాప్ పడుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment