Friday, March 22, 2019

మరో బెంగళూరుగా హిందూపురం…బాలకృష్ణ.


అనంతపురంజిల్లా:హిందూపురం: న్యూస్‌టుడే:
*నామినేషన్ వేసేందుకు బాలకృష్ణ భారీ ప్రదర్శన…
అనంతపురంలో తెదేప అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు బాలకృష్ణ భారీ ప్రదర్శనతో బయలు దేరారు. ముందుగా సెంటిమెంట్ ప్రకారం పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి కార్యకర్తలు,  అభిమానులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భముగ బాలకృష్ణ మట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిందని, అలాంటి పార్టీ కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎవరెన్ని చేసినా రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. 150 కి పైగా సీట్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment