గుంటూరు,బాపట్ల న్యూస్టుడే:
సృష్టికి మూలం మాతృమూర్తి, స్త్రీ అని కృష్ణానందగిరి మాతాజీ పేర్కొన్నారు. బాపట్లలో ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 93వ సనాతన వేదాంత జ్ఞానసభల్లో భాగంగా శుక్రవారం స్త్రీల ప్రత్యేక సభకు ఆమె అధ్యక్షత వహించారు. చంద్రకాళీ మాతాజీ, శివ చైతన్యానంద సరస్వతీ మాతాజీ, సుజ్ఞాననందగిరి మాతాజీ, పరావిద్యానందగిరి మాతాజీ, నిర్విశేషానందగిరి మాతాజీ, పరబ్రహ్మానందగిరి, జ్ఞానేశ్వరి మాతాజీ, విజ్ఞాననందగిరి మాతాజీ, పీఠాధిపతి పరిపూర్ణానందగిరి, అసంగానందగిరి స్వామి, దిండి నిర్మలానందగిరి స్వామి, ఆచార్య పరిశుద్ధానందగిరి స్వామి తదితరులు ఈ సందర్భంగా పలు అంశాలపై ఉపన్యసించారు. వేగేశన ఛారిటబుల్ ట్రస్టు అధినేత, తెదేపా నాయకుడు వేగేశన నరేంద్రవర్మ రాజు, హరికుమారి దంపతులు ఏర్పేడు శ్రీవ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
No comments:
Post a Comment