Saturday, March 23, 2019

కెమెరాలుంటే ధర్నాకు దిగుతాం….


జగిత్యాల న్యూస్‌టుడే: 
*ఎక్కువ నిధులు రాబట్టొచ్చని ఎంపీ కవిత చెప్పారు
కాంగ్రెస్ నేతలపై ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కెమెరాలుంటేనే తెలంగాణ కోసం కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ కోసం అరగంటకు మించి కొట్లాడలేరని ఎద్దేవా చేశారు. శనివారం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ కవిత.. ఢిల్లీ మెడలు వంచింది కేసీఆరే అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వాళ్లతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే.. కేంద్రంలో మనమే కీలకం కావొచ్చని, తెలంగాణ అభివృద్ధికి ఎక్కువ నిధులు రాబట్టొచ్చని ఎంపీ కవిత చెప్పారు

No comments:

Post a Comment