Saturday, March 23, 2019

రైతుకు భరోసా ఇచ్చిన నేత ….

శ్రీకాకుళం  న్యూస్‌టుడే:
*రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో…
*తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం…
రైతు దేశానికి వెన్నెముక. రైతు లేనిదే తినడానికి తిండి లేదు. జీవనం లేదు. ప్రజలందరికీ  అన్నం పెట్టే రైతులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో, రుణ భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందరి జీవితాలతో ముడిపడి ఉన్న రైతులు ఆధారపడిన వ్యవసాయ రంగం మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంతో రైతులకు వ్యవసాయం చేయడం సమస్యగా మారింది. గతి లేక వ్యవసాయం చేస్తే, చివరిలో విపత్తు వస్తే, ఆ ఏడాది పంట తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ పరిస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలని, వ్యవసాయాన్ని  పునరుద్ధరించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృఢ నిశ్చయంతో ఉన్నారు.ఈ మేరకు రైతాంగానికి, వ్యయసాయ రంగానికి మేలు చేసేందుకు ముందుకువచ్చారు.  తాను రూపొందించిన ‘నవరత్నాలు’ పథకాల్లో  ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’ పేరిట రైతాంగాన్ని అదుకుంటామని ధైర్యం చెబుతున్నారు.  ఈ హామీతో సగటు రైతుకు ఏడాదిలో కనీసం ఒక రూ.లక్ష వరకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా రూ.12,500 ఆర్థిక సాయం, ఉచిత బోరు, ఉచిత విద్యుత్, రోడ్‌ ట్యాక్స్, సున్నా వడ్డీ వంటి సేవలతో రైతులకు ప్రతి ఏటా ప్రయోజనం చేకూరుతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీతో ప్రతి రైతు  ధైర్యంగా వ్యయసాయం చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి నెలకొంటుంది.

No comments:

Post a Comment