తాళ్లరేవు, న్యూస్టుడే: మండలంలోని జార్జిపేట పోలీసు చెక్పోస్టు వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో నగదు పట్టుబడింది. సోమవారం చెక్పోస్టు వద్ద కోరంగి పోలీసులు అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న కారును తనిఖీ చేయగా, అందులో రూ. 2.55 లక్షల నగదు పట్టుబడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్కు అప్పగించినట్లు పోలీసులు వివరించారు.
No comments:
Post a Comment