పశ్చిమ గోదావరి గోదావరి:న్యూస్టుడే:
* విషాహారాన్ని తిని తల్లి-కొడుకు మృతి….
*నిన్న రాత్రి నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినడం వల్ల మృతి ….
విషాహారాన్ని తిని తల్లి-కొడుకు మృతి చెందిన ఘటన శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బడిగూడెంలో చోటు చేసుకుంది. బడిగూడెంలో నివాసముంటున్న తల్లి ప్రేమ కుమారి (28), కొడుకు ప్రవీణ్ (12) లు నిన్న రాత్రి నిల్వ ఉంచిన మాంసాహారాన్ని తినడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments:
Post a Comment