బాలీవుడ్ న్యూస్టుడే:యాంకర్..నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో ‘కథనం’ సినిమా రూపొందుతోంది. రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్ రాజ్, వెన్నెల కిషోర్, రణ్ధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భాన్ని పురస్కరించుకుని సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా టీజర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ది మంత్ర ఎంటర్టైన్మైంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ టీజర్ ఆద్యంతం సస్పెన్స్గా ఉంది.

No comments:
Post a Comment