న్యూ ఢిల్లీ న్యూస్టుడే:
భారత్, పాకిస్తాన్ల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల మధ్య చైనా ఏ పక్షంవైపూ మొగ్గు చూపక తటస్థంగా వ్యవహరించనున్నది. ఈ మేరకు అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) అనుబంధ మీడియా వార్తలను ప్రచురించింది. సిపిసి అధికార పత్రికగా పేరొందిన గ్లోబల్ టైమ్స్ ఒక వార్త ప్రచురించింది. భారత్-పాక్ వివాదంలో చైనా ఏ పక్షాన్నీ సమర్థించక తటస్థంగా ఉంటుందని వార్త ప్రచురించింది. దీనితో భారత్పై మరింత ఉధృతంగా దాడి చేయాలనుకునే పాకిస్తాన్ అవకాశాలు దెబ్బ తిన్నాయి.

No comments:
Post a Comment