జమ్మూ కాశ్మీర్ న్యూస్టుడే:
బోర్డర్లో కాల్పుల మోతకు విరామం లేదు.మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.ఎల్వోసీ దగ్గర ఎనిమిది చోట్ల పాక్ సైనికులు కాల్పులు జరిపారు.పాక్ కాల్పులకు అమాయక ప్రజలు బలి అయ్యారు.ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి చెందింది.ఆర్మీ మేజర్ సహా నలుగురు జవాన్లకు గాయాలు అయ్యాయి.పాక్ సైనికుల కాల్పులను భారత బలగాలు తిప్పి కొడుతున్నాయి.సరిహద్దు ప్రజలు మాత్రం ఏక్షణాన ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటున్నారు.
No comments:
Post a Comment