ప్రస్తుతం హర్రర్ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడుతుండడం తో దర్శక , నిర్మాతలు అదే తరహాలో కథలను రాసుకొని తక్కువ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ.గురునాథ రెడ్డి సమర్పణలో ఎ.బి.టి క్రియేషన్స్ బ్యానర్పై రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో రామ్కార్తీక్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్స్గా నటించారు. ఎక్కువగా అడల్ట్ కామెడీ మీద దృష్టి పెట్టి యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా..సెకండ్ హాఫ్ బాగా సాగతీసినట్లు అనిపించింది.

No comments:
Post a Comment