ఒంగోలు న్యూస్టుడే:
వైద్యారోగ్యశాఖలో చేపట్టిన శాశ్వత ఏఎన్ఎంల నియామక ప్రక్రియకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ అరుణకుమారి బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్వోలకు సమాచారం పంపించారు. జిల్లాలో 99 శాశ్వత ఏఎన్ఎం పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment