బాలీవుడ్ న్యూస్టుడే:వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రం మహర్షి. హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని శరవేగంగా జరుపుతున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్బాబు..పూజా హెగ్డెతో పాటు అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా లొకేషన్ స్టిల్స్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం.

No comments:
Post a Comment