సాధారణంగా రధసప్తమి అనంతరం ఎండలు మండిపోతాయని జనం భయపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవనుకుంటారు. కానీ ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణం నెలకొంది. అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ఒకటి రెండు భారీ వర్షాలు ఇప్పటికే కురవగా శనివారం, ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
No comments:
Post a Comment