Wednesday, March 20, 2019

హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభించిన గవర్నర్…

హైదరాబాద్: న్యూస్‌టుడే:  
  1. ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్‌- హైటెక్ సిటీ మెట్రో సేవలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్‌ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు…
  2.  ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు…
  3. ఐటీ ఉద్యోగులకు ఎంతో ఊరట లభించింది.
ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్‌- హైటెక్ సిటీ మెట్రో మార్గం బుధవారం అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్‌ స్టేషన్‌లో జెండా ఊపి మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. 

No comments:

Post a Comment