Friday, March 15, 2019

కాల్పుల కలకలం….


విశాఖ న్యూస్‌టుడే:
  • విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్.
  • ఇద్దరు మావోలు మృతి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ ఏజెన్సీలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. పెదబయలు మండలం పి.కోడాపల్లి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం విశాఖకు తరలిస్తున్నారు పోలీసులు.

No comments:

Post a Comment