ఒంగోలు న్యూస్టుడే:
ఇంటర్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం పరీక్షలకు సంబంధించి పొదిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతున్న ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆర్ఐవో మనోహరబాబు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ, ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 25,519 మందికి గాను 1,058 మంది గైర్హాజరయ్యారు. ప్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 38 కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

No comments:
Post a Comment