Thursday, March 14, 2019

అగ్రిగోల్డ్‌ రెండో విడత దరఖాస్తుల స్వీకరణ…


ఒంగోలు , న్యూస్‌టుడే:
అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ. పదివేలలోపు డిపాజిట్‌ చేసిన మదుపరుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మరో ఎనిమిది వారాలు పొడిగించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌ఛార్జి ఛైర్మన్, ఇన్‌ఛార్జి జిల్లా జడ్జి ఆర్‌.జె.విశ్వనాథం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.రాజావెంకటాద్రి తెలిపారు.  ఇంకా నమోదు చేసుకోని మదుపరులు ఉండటంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పొడిగించినట్లు వారు తెలిపారు. రెండో విడత దరఖాస్తుల స్వీకరణ తేదీలను మండలాల వారీగా పత్రికాముఖంగా తెలుపుతామని అన్నారు. డిపాజిటర్ల నమోదు సమయంలో ఒరిజినల్‌ బాండ్, ఒరిజినల్‌ బ్యాంకు పాస్‌పుస్తకం, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డుతోపాటు వాటి జిరాక్స్‌ కాపీలు రెండు సెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.

No comments:

Post a Comment