గుంటూరుజిల్లా: అమరావతి:
* కేసీఆర్లకు ఊడిగం చేయడానికి జగన్ రెడీ అయ్యారని ఎద్దేవా….
*అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని కార్యకర్తలు అడ్డుకోవాలి…..
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. మోడీ, కేసీఆర్లకు ఊడిగం చేయడానికి జగన్ రెడీ అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ కోరేది మార్పు కాదు.. ఏపీ మరణ శాసనమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోటల్లా జగన్ సంతకం పెడతారని ఆరోపించారు. తన మాట వినకుంటే జగన్ అవినీతి ఫైల్పై కేసీఆర్ సంతకం పెడతారని అన్నారు. డబ్బులు ఇస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లు ఇస్తోందన్నారు. జనరల్ సెగ్మెంట్కు ఓ రేటు.. రిజర్వేషన్ సెగ్మెంట్కు ఓ రేటు పెట్టారంటూ పార్టీ వీడిన వారే చెబుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

No comments:
Post a Comment