విశాఖపట్నం, న్యూస్టుడే:
- బీఎఫ్-2లోని కొన్ని యంత్రాలు మొరాయించడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు…
- మళ్లీ ఈ నెల 10వ తేదీన బీఎఫ్-2లోని కొన్ని యంత్రాలు మొరాయించడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు…..
- విశాఖ ఉక్కు కర్మాగారానికి గుండె లాంటి మూడు బ్లాస్ట్ ఫర్నెస్ల్లో ఒకటి ఇటీవల తరచూ మొరాయిస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో అధిక ఉత్పత్తిని సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న యాజమాన్యానికి ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఈ మధ్యకాలంలో పలు సాంకేతిక లోపాలతో బీఎఫ్-2లో తరచూ ఉత్పత్తి ఆగిపోతోంది. ఈ ఏడాది జనవరి నెలలో ఒకసారి ఆగిపోతే… అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. మళ్లీ ఈ నెల 10వ తేదీన బీఎఫ్-2లోని కొన్ని యంత్రాలు మొరాయించడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు కార్మికులు పేర్కొన్నారు. ఫర్నెస్లోని రన్నర్స్ పూర్తిగా స్లాగ్తో నిండిపోయినట్లు వారు చెబుతున్నారు. విభాగంలోని 32 ట్యూయర్లు మెటీరియల్తో స్తంభించిపోయినట్లు సమాచారం. వీటిని పునరుద్ధరించేందుకు మరో 4 రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్నెస్లోకి కూలింగ్ వాటర్ లీక్ అవుతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ అధికారులను రప్పించి సమస్య మూలాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment