Thursday, March 21, 2019

నేను పక్కా లోకల్‌……….


సీతారాంపురం నార్త్‌ (నరసాపురం గ్రామీణ), న్యూస్‌టుడే:
*నేను పక్కా లోకల్‌ అని…..
జనసేన పార్టీ తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేస్తున్నానని కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. నరసాపురం మండలం సీతారాంపురంనార్త్‌లో ఆ పార్టీ ఉభయగోదావరి జిల్లాల సమన్వకర్త కలువకొలను తులసీరావు ఇంటికి ఆయన బుధవారం రాత్రి పది గంటల తర్వాత చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ఎంపీ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం అనందంగా ఉందన్నారు. తాను స్థానికుడినేనని.. పుట్టిపెరిన చోట ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఆయన వెంట తులసీరావుతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, చిరంజీవి, పవన్‌ యువత రాష్ట్ర కార్యదర్శి కోపల్లె శ్రీనివాస్‌ తదితరులున్నారు.

No comments:

Post a Comment