కనిగిరి, న్యూస్టుడే:
పట్టణంలోని నాలుగో వార్డులోని విశ్రాంత ఉద్యోగి ఇంటిలో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్ ఖాజామొహిద్దీన్ ఉద్యోగ విమరణ పొంది తన భార్యతో కలసి స్థానికంగా ఉంటున్నారు. ఆయన కుమారుడైన రియాజ్ హైదరాబాద్లో ఉంటుండగా, కొద్దిరోజుల క్రితం ఇంటికి తాళం వేసి అక్కడకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు ఆదివారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. తలుపుల తాళాలు పగల గొట్టి బీరువా, అలమరల్లో ఉన్న సుమారు 5 సవర్ల బంగారం, కేజీన్నర వెండి ఆభరణాలు అపహరించారు. సోమవారం ఉదయం తలుపులు తీసి ఉండటాన్ని గమనించిన బంధువులు హైదరాబాద్లో ఉంటున్న ఖాజామొహిద్దీన్ తెలపడంతో వారు చరవాణి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సంగమేశ్వరరావు, శిక్షణ ఎస్సై వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments:
Post a Comment