పశ్చిమగోదావరి న్యూస్టుడే :
- గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని,వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సిపిఎం గణపవరం మండల కమిటి కార్యదర్శి పెచ్చేటి నరసింహమూర్తి డిమాండ్ చేశారు.
- సమావేశంలో నారపల్లి రమణారావు, మేడిశెట్టి పెంటారావు, చిన్నం చిననాగేశ్వరరావు, గవర సత్యనారాయణ, కొటకల త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు
మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని,వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని సిపిఎం గణపవరం మండల కమిటి కార్యదర్శి పెచ్చేటి నరసింహమూర్తి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బిటి.రణదివ్వె భవనంలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం కవల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పెచ్చేటి నరసింహమూర్తి మాట్లాడుతూ మండలంలోని జల్లికొమ్మర గ్రామంలో మంచినీటి చెరువును పూర్తిగా ఎండగట్టారని, జల్లికాకినాడ గ్రామంలో మంచినీటి చెరువు పసర్లు వచ్చి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. ఈ గ్రామాలకు మంచినీటి సరఫరా కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరి పైరు పొట్ట దశలో ఉన్నందున సాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నారపల్లి రమణారావు, మేడిశెట్టి పెంటారావు, చిన్నం చిననాగేశ్వరరావు, గవర సత్యనారాయణ, కొటకల త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment