శ్రీకాకుళం(అరసవల్లి)న్యూస్టు డే:
*అడ్హక్ కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు సముచితస్థానం……….
*డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ……..
*డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ……..
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అడ్హక్ కార్యవర్గంలో శ్రీకాకుళం జిల్లాకు సముచితస్థానం లభించింది.ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో జిల్లాకు పోలీసు అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న కె.రాధాకృష్ణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సహాయ కార్యదర్శిగా నియమించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎం.అరుణకుమారిను నియమించారు. తమకు సముచితస్థానం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జె.శ్రీనివాసరావుకు, డీజీపీలకు జిల్లా అధ్యక్షులు కె.అప్పన్న కృతజ్ఞతలు తెలిపారు.
డెస్క్
No comments:
Post a Comment